ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇరుగుపొరుగు వాళ్లు వేధిస్తున్నారని ఓ మహిళ మైనర్ అయిన తన కొడుకుతో సహా ఆత్మహత్యకు పాల్పడింది. ముంబైలోని చండీవాలి ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. చండీవాలి ఏరియాకు చెందిన ఓ 44 ఏండ్ల మహిళ మైనర్ అయిన తన కొడుకుతో కలిసి ఒక అపార్టుమెంట్లో ఉంటుంది. అయితే, అమె కొడుకు మితిమీరిన అల్లరి చేస్తూ తమ పిల్లలను కొడుతున్నాడని ఇరుగుపొరుగు తరచూ గొడవ పడుతున్నారు. దాంతో విసిగిపోయిన ఆమె తమ ఫ్లాట్లో నుంచి కొడుకుతో సహా కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు సూసైడ్ నోట్ రాసిపెట్టింది. మృతురాలి సూసైట్ నోట్ ఆధారంగా పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.