రాయ్పూర్ : ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. జగర్గుండు పరిధిలోని కుందేడ్ గ్రామానికి చెందిన ఏడుగురు యువకులను ఈ నెల 18న మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. దీంతో ఆ యువకులు తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. యువకులను మావోయిస్టుల బారి నుంచి కాపాడేందుకు వెళ్లిన నలుగురు కుటుంబ సభ్యులు కూడా అదృశ్యమయ్యారు. యువకులతో పాటు కుటుంబ సభ్యులు అదృశ్యం కావడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.