న్యూఢిల్లీ : (Defence Companies) విజయదశమి పండగను పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను విలీనం చేయడం ద్వారా కొత్తగా 7 రక్షణ సంస్థలను ఏర్పాటు చేయడానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. కొత్తగా నెలకొల్పిన 7 రక్షణ సంస్థలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితమిచ్చారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ (ఓఎఫ్బీ) ని రద్దు చేయడం ద్వారా ఈ కంపెనీలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య ఆయుధాల దిగుమతిని తగ్గిస్తుందని భావిస్తున్నారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ ప్రసంగించారు.
41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను విలీనం చేయడం ద్వారా.. మునిషన్స్ ఇండియా లిమిటెడ్ (ఎంఐఎల్), ఆర్మ్డ్ వెహికిల్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (అవాని), అడ్వాన్స్డ్ వెపన్స్ అండ్ ఎక్విప్మెంట్ ఇండియా లిమిటెడ్ (ఏడబ్ల్యూఈ ఇండియా), ట్రూప్స్ కంఫోర్ట్స్ లిమిటెడ్ (టీసీఎల్), యంత్ర ఇండియా లిమిటెడ్ (వైఐఎల్), ఇండియా ఆప్టెల్ లిమిటెడ్ (ఐఓఎల్), గ్లైడర్స్ ఇండియా లిమిటెడ్ (జీఐఎల్). అనే కొత్త డిఫెన్స్ కంపెనీలు ఏర్పాటయ్యాయి. పిస్టల్ నుంచి ఫైటర్ విమానం వరకు ఈ కంపెనీల్లోనే తయారు చేసేలా చర్యలు తీసుకోనున్నారు. రక్షణ శాఖలో సంస్కరణలు తీసుకురావడానికి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ (ఓఎఫ్బీ) ని రద్దు చేసి ఏడు ప్రభుత్వ యాజమాన్య సంస్థలుగా మార్చబోతున్నట్లు ఒకరోజు ముందుగానే ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది.
‘ఈ నిర్ణయం గత 15-20 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నది. రాబోయే కాలంలో ఈ ఏడు కంపెనీలు భారతదేశ సైనిక బలానికి ప్రధాన స్థావరంగా మారుతాయని నాకు నమ్మకమున్నది. ఐదేండ్లలో రక్షణ ఎగుమతులు 325 శాతం పెరిగాయి. డిఫెన్స్ కంపెనీలను అప్గ్రేడ్ చేయడం అవసరం. రక్షణ రంగంలో ప్రవేశించనున్న ఈ 7 కొత్త కంపెనీలు దేశం పట్ల సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తాయి’ అని ఈ సందర్భంగా ప్రసంగించిన నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
అన్నపూర్ణలకే ఆహార సమస్యలు.. రక్తహీనత సమస్యలు తొలిగేదెలా?
ఎయిమ్స్ సీనియర్ వైద్యురాలిపై తోటి వైద్యుడు లైంగికదాడి
బాలీవుడ్ వృద్ధ బేగం ఫరూక్ జాఫర్ కన్నుమూత
చిన్నారులు అభిమానించే వాల్ట్ డిస్నీ ప్రారంభం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..