ఆ ప్రయాణికులకు 7 రోజుల ఇన్స్టిట్యూషనల్ క్వారెంటైన్

న్యూఢిల్లీ: ఇవాళ ఎయిర్ ఇండియా విమానంలో యూకే నుంచి ఢిల్లీకి వచ్చిన ప్రయాణికులు తప్పనిసరిగా ఏడు రోజులపాటు ఇన్స్టిట్యూషనల్ క్వారెంటైన్లో ఉండాల్సిందేనని ఢిల్లీ ప్రభుత్వం నిబంధన విధించింది. కరోనా పరీక్షల్లో నెగెటివ్ వచ్చినా ఏడు రోజుల ఇన్స్టిట్యూషనల్ క్వారెంటైన్ తప్పనిసరని, ఆ తర్వాత విధిగా మరో ఏడు రోజులు హోమ్ క్వారెంటైన్లో ఉండాలని ఢిల్లీ సర్కారు ఆదేశించింది. ఈ మేరకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఒక ప్రకటన చేశారు.
ఇటీవల యూకేలో కరోనా న్యూ స్ట్రెయిన్ మొదలై వేగంగా విస్తరిస్తుండటంతో కేంద్రం భారత్-యూకే మధ్య విమాన ప్రయాణాలపై నిషేధం విధించింది. అయితే, న్యూ స్ట్రెయిన్ ప్రభావం ఏ మాత్రం తగ్గకపోయినా తాజాగా విమాన సర్వీసులపై నిషేధాన్ని ఎత్తివేశారు. దాంతో ఈ ఉదయం ఓ ఎయిర్ ఇండియా విమానం యూకే నుంచి 246 మంది ప్రయాణికులతో ఢిల్లీకి వచ్చింది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఢిల్లీ సీఎం కేజ్రివాల్.. ఆఫ్లైట్లో వచ్చిన ప్రయాణికులందరికీ ఏడు రోజుల ఇన్స్టిట్యూషనల్ క్వారెంటైన్ నిబంధన విధించారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- 15 నిమిషాల్లో దోపిడీ చేసి.. 15 గంటల్లో పట్టుబడ్డారు
- అంటార్కిటికా దీవుల్లో భూకంపం..
- డ్రైవరన్నా.. సలాం!
- ఓటీటీలో అడుగుపెట్టబోతున్న మాస్టర్
- ఎర్రలైటు పడితే ఆగాలి.. గ్రీన్ పడ్డాకే కదలాలి
- కోపంతో కాదు ప్రేమతోనే..
- వివాదం పరిష్కారమే ఎజెండాగా.. నేడు చైనాతో భారత్ చర్చలు
- సరికొత్తగా.. సాగర తీరం
- దుబాయ్లో ఘనంగా నమ్రత బర్త్డే సెలబ్రేషన్స్ .. పిక్స్ వైరల్
- నల్లాకు మీటర్.. ‘క్యాన్'కు ఆధార్ ఉండాల్సిందే