న్యూఢిల్లీ, ఆగస్టు 7: బ్యాంకులను రూ.6,833 కోట్ల మేర మోసగించిన అభియోగంపై కాన్పూరుకి చెందిన శ్రీ లక్ష్మి కాట్సిన్ సంస్థపై, దాని చైర్మన్ మాతా ప్రసాద్ అగర్వాల్ తదితరులపై సీబీఐ కేసు నమోదు చేసింది. నొయిడా, కాన్పూర్ తదితర 9 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. అగర్వాల్ తదితరులు కుట్రపూరితంగా మోసగించారని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిర్యాదులో పేర్కొంది.