చెన్నై: కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకే పెరిగిపోతుండటంతో వివిధ రాష్ట్రాలు, సెమీ స్టేట్స్, కేంద్రపాలిత ప్రాంతాల్లో అక్కడి ప్రభుత్వాలు నైట్ కర్ఫ్యూలు, వీకెండ్ లాక్డౌన్లు లాంటి కఠిన నిబంధనలను అమలు చేస్తున్నాయి. తాజాగా సెమీ స్టేట్ పుదుచ్చేరిలో కూడా ప్రభుత్వం ఇలాంటి నిర్ణయమే తీసుకున్నది. వచ్చే శుక్రవారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు పూర్తిస్థాయిలో వీకెండ్ లాక్డౌన్ను అమలు చేయనున్నట్టు ప్రకటించింది.
దేశవ్యాప్తంగా కొవిడ్-19 కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. పుదుచ్చేరిలో నిన్నటి నుంచే నైట్ కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. ఆ మరుసటి రోజే వీకెండ్ లాక్డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. నైట్ కర్ఫ్యూ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమల్లో ఉంటుంది. కాగా పుదుచ్చేరిలో కొత్తగా 4,692 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
ప్రజలకు ఫేస్ మాస్కులు పంచిపెట్టిన దేవుళ్లు..!
కరోనా సెకండ్ వేవ్ మోదీ సృష్టించిన విపత్తు: మమతాబెనర్జి
మామిడి పండ్లు తింటే ఇన్ని లాభాలా..!
38 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్.. ఏ జైల్లోనో తెలుసా..?
సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని మంత్రి సత్యవతి పూజలు
ఈ నెల 30 వరకు బ్రిటన్కు విమాన సర్వీసులు బంద్ : ఎయిర్ ఇండియా
కరోనాతో హాస్పిటల్లో చేరిన ధోనీ తల్లిదండ్రులు
బెంగాల్లో B.1.618 వేరియంట్ దడ..