హైదరాబాద్ : నాగార్జున సాగర్ ఉప ఎన్నికల తర్వాత పీసీసీ అధ్యక్షుడి పేరు ప్రకటన ఉంటుందని సీఎల్పీ నేత, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భట్టి విక్రమార్క తెలిపారు.
పీసీసీ అధ్యక్ష పదివి ఎవరికి ఇవ్వాలన్నది అధిష్ఠానం నిర్ణయిస్తుందని ఆయన చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రభావం నాగార్జున సాగర్ ఉప ఎన్నికపై ఉండబోదని అన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి మంచి మెజారిటీతో విజయం సాధిస్తారని భట్టి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో షర్మిల కొత్తగా పెట్టబోయే పార్టీతో కాంగ్రెస్కు జరిగే నష్టమేమీ లేదని చెప్పారు.
తమకంటే అధికార టీఆర్ఎస్కే ఎక్కువ నష్టం జరిగే అవకాశముందని పేర్కొన్నారు. షర్మిల తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది.. కాంగ్రెస్ పార్టీయేనని గుర్తు పెట్టుకోవాలన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.