చేగుంట, ఏప్రిల్ 7: సమాజంలో గురువుల సేవలు మరువలేనివని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి అన్నారు. కస్తూర్బా పాఠశాల ఉపాధ్యాయురాలు శ్రీదేవి గుండెపోటుతో మృతిచెందడం బాధాకరమన్నారు. శ్రీదేవి కుటుంబ సభ్యులకు బుధవారం కేజీబీవీ రాష్ట్ర అధ్యక్షురాలు స్వరూపరాణి ఆధ్వర్యంలో జిల్లా సిబ్బంది రూ.46 వేలు, రూ.25 వేలు రఘోత్తంరెడ్డి, చేగుంట ఎంపీపీ శ్రీనివాస్ రూ.10వేలు, వడియారం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గంగబాయి రూ.6,500తోపాటు మొత్తం రూ.లక్ష 25వేల ఆర్థిక సహాయం అందజేశారు. చేగుంట, నార్సింగి మండలాల ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో మరో రూ.లక్ష 10వేలు డీఈవో రమేశ్ చేతుల మీదుగా శ్రీదేవి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి మాట్లాడుతూ.. సమాజంలో ప్రతి విద్యార్థికి జ్ఞాన సంపద ఉపాధ్యాయుల ద్వారానే వస్తుందన్నారు. శ్రీదేవి కుటుంబానికి తోటి ఉపాధ్యాయులు చేయూతను అందించడం అభినందనీయమన్నారు. వారి పిల్లల చదువు, ఉద్యోగం సంపాదించేంత వరకు తనవంతు సహకారం ఉంటుందని తెలిపారు. శ్రీదేవి కుటుంబాన్ని దుకోవాలని ఎంపీపీ మాసుల శ్రీనివాస్ ఎమ్మెల్సీని కోరారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి బుచ్చనాయక్, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకరి కృష్ణ, ఉపాధ్యాయ పత్రిక సంపాదకులు శ్రీనివాస్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, కృష్ణకాంత్, రామకృష్ణ, జిల్లా బాధ్యులు అల్లి విజయసేనారెడ్డి, నాగేశ్వరరావు, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ భూపాల్రెడ్డి పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండీ…
కేసీఆర్ తాత అభివృద్ధి ప్రదాత
మాస్కుల్లేని 90 మందికి జరిమానా