మనిషి మెదడులో మధుర జ్ఞాపకాలు ఎప్పుడూ తాజాగానే ఉంటాయి. అయితే, కొన్నేండ్ల నుంచీ మనిషి మెదడుకు పని లేకుండా పోయింది. సోషల్ మీడియానే జ్ఞాపకాలను గుర్తు చేసేందుకు నోటిఫికేషన్లు పంపిస్తున్నది. గతంలో అప్లోడ్ చేసిన పోస్ట్లతోపాటు ఆత్మీయుల పుట్టినరోజులనూ గుర్తు చేస్తున్నది. తాజాగా కొందరు పరిశోధకులు, సోషల్ మీడియాద్వారా షేర్ చేస్తున్న జ్ఞాపకాల విషయంలో ప్రజలు ఎలా ఫీలవుతున్నారన్న కోణంలో అధ్యయనం చేశారు. సోషల్ మీడియాలో అపార ప్రాధాన్యం ఉన్న ‘లైక్’లు జ్ఞాపకాల విషయంలో నెగెటివ్ ప్రభావం చూపిస్తున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. ఏ ఫేస్బుక్లోనో పోస్ట్ చేసిన ఓ మంచి మెమొరీకి తక్కువ లైకులు వస్తే, దాన్ని షేర్ చేసినవాళ్లు ఏ మాత్రం సంతోష పడటం లేదని వెల్లడైంది. ఇలా, మధుర జ్ఞాపకాలు కూడా చేదు జ్ఞాపకాలై పోతున్నాయి.