జైపూర్: రాజస్థాన్లోని జోధ్పూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జోధ్పూర్లోని డంగియావస్ సమీపంలో ఓ కారు.. ట్రాక్టర్ కిందికి దూసుకెళ్లింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులు అజ్మీర్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ప్రమాదం సోమవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో జరిగిందని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.