భోపాల్: ఆదివారం ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పిడుగులు పడి 68 మంది మరణించిన ఘటనను మరువకముందే మధ్యప్రదేశ్లో మరోసారి పిడుగుల మోత మోగింది. సోమవారం మధ్యప్రదేశ్లోని వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులు పడి ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 11 మంది గాయపడ్డారు. గ్వాలియర్, షియోపూర్, శివపురి, షాదోల్ జిల్లాల్లో ఈ పిడుగుపాట్లు చోటుచేసుకున్నాయి. మృతుల్లో గ్వాలియర్, షియోపూర్ జిల్లాలకు చెందిన వారు ఇద్దరు చొప్పున.. శివపురి, షాదోల్ జిల్లాలకు చెందిన వారు ఒక్కరు చొప్పున ఉన్నారు.