హైదరాబాద్ : ఇంటి ముందు పార్క్ చేసిన కారును దొంగలు కొట్టేశారు. ఈ ఘటన నగరంలోని ఉప్పల్లో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసం ఉండే ఓ వ్యాపారవేత్త తన మారుతి ఎర్టిగా(TS-09-FP-4701) కారును గడిచిన రాత్రి ఇంటి ముందు పార్క్ చేశాడు. ఉదయం లేచి చూసే సరికి కారు కనిపించకుండా పోయింది. దీంతో ఆందోళన చెందిన సదరు బాధితుడు ఉప్పల్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ టీవీ కెమెరాల ఆధారంగా దొంగలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా పౌరులు సదరు కారును గుర్తిస్తే తమ వాట్సప్ నంబర్ 9490617111 కు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరారు.