ఢిల్లీ : ప్రస్తుత కొవిడ్-19 సెకండ్ వేవ్లో ఇప్పటివరకు 594 మంది వైద్యులు తమ ప్రాణాలు కోల్పోయినట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) బుధవారం తెలిపింది. ఢిల్లీలో అత్యధికంగా 107 మంది డాక్టర్ల మరణాలు నమోదయ్యాయి. కరోనా మొదటి వేవ్లో దేశవ్యాప్తంగా 748 మంది వైద్యులు చనిపోయినట్లు ఐఎంఏ తెలిపింది. సెకండ్ వేవ్లో ఢిల్లీలో 107 మంది వైద్యులు మరణాలు నమోదు కాగా బిహార్లో 96, ఉత్తరప్రదేశ్లో 67, రాజస్థాన్లో 43, జార్ఖండ్లో 39, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 32 మంది చొప్పున మరణించినట్లు ఐఎంఏ నివేదికలు వెల్లడించాయి. భారతదేశ వ్యాప్తంగా గతేడాది కొవిడ్-19తో 749 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోతే ఈ సెకండ్ వేవ్లో ఈ స్వల్ప సమయంలోనే ఇప్పటివరకు 594 మంది డాక్టర్లు చనిపోయినట్లు ఐఎంఏ ప్రెసిడెంట్ జేఏ జయలాల్ తెలిపారు.