కోటగిరి, మార్చి 28 : మండలంలోని పొతంగల్ సాయి బాబా ఆలయ ఆవరణలో అయ్యప్ప స్వామి జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజాకార్యక్రమాలను ఆదివారం నిర్వహించారు. సూదం శంకర్ గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామివారి జన్మదిన వేడుకలు కొనసాగాయి. ఉదయం 8 గంటల నుంచి ప్రత్యేక పూజలు, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి వారికి అభిషేకాలు, మధ్యాహ్నం ఒంటిగంటకు 18 మెట్ల పడి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయ్యప్ప, హనుమాన్ మాలధారులు పాల్గొని పేటతుళ్లి ఆడారు. అయ్యప్ప నామస్మరణతో పొతంగల్ గ్రామం మార్మోగింది. అనంతరం భిక్ష ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో రాధాకృష్ణ గురుస్వామి, శంకర్గురుస్వామితోపాటు డీసీసీబీ డైరెక్టర్, పొతంగల్ విండో చైర్మన్ శాంతేశ్వర్పటేల్, ఎంపీటీసీ కేశ వీరేశం, ఆయా గ్రామాలకు చెందిన మాలధారులు పాల్గొన్నారు.
అయ్యప్ప ఆలయాల్లో..
భీమ్గల్ పట్టణంతో పాటు వేల్పూర్ మండల కేంద్రంలోని అయ్యప్ప ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేకం, విశేష పూజా కార్యక్రమాలు కొనసాగాయి. భక్తులు హాజరై తీర్థ ప్రసాదా లను స్వీకరించారు.
ఇవీ కూడా చదవండి..
మే మాసంలో యాదాద్రి ఆలయం పునఃప్రారంభం : సీఎం కేసీఆర్
జర్నలిస్టుల సంక్షేమనిధికి మరో రూ.17.50 కోట్లు విడుదల