హైదరాబాద్ : నాగార్జునసాగర్ నియోజకవర్గంలో తనకే గనుక ఓటు హక్కు ఉంటే తన ఓటు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్కేనని ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మ అన్నారు. చిరుతపులితో నోముల భగత్ కలిసి నడిచే వీడియోను వర్మ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేస్తూ ఈ విధంగా స్పందించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ను సింహం, పులితో పోల్చిన రాంగోపాల్ వర్మ ఈ వీడియో చూసిన తర్వాత చిరుతపులిని వాకింగ్కు తీసుకువెళ్లిన నోముల భగత్ను ఇష్టపడుతున్నట్లు తెలిపారు. తనకే కనుక సాగర్ నియోజకవర్గంలో ఓటుంటే ఈ నెల 17న జరిగే ఉపఎన్నిక పోలింగ్లో నోముల భగత్కే ఓటు వేస్తానని తెలిపారు.