హైదరాబాద్ : తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 5,695 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం తెలిపింది. వైరస్ బారినపడి మరో 49 మంది ప్రాణాలు వదిలారు. నిన్న ఒకే రోజు 58,742 మంది పరీక్షలు చేయగా.. 5,695 కేసులు వెలుగు చూశాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. మహమ్మారి నుంచి కొత్తగా 6,206 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 80,135 యాక్టివ్ కేసులున్నాయని పేర్కొంది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 1,352, మేడ్చల్ జిల్లాలో 427, రంగారెడ్డిలో 483 కరోనా కేసులు నమోదయ్యాయి.