హైదరాబాద్ : తెలంగాణ శాసన మండలి చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు సతీమణి విజయలక్ష్మి పార్ధీవ దేహానికి తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి సత్యవతి రాథోడ్ తో కలిసి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ నివాళులు అర్పించారు. బోడకుంటి వెంకటేశ్వర్లును పరామర్శించారు.
విజయలక్ష్మి మరణానికి దారి తీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. బోడకుంటి కుటుంబ సభ్యులను ఓదార్చిన మంత్రి ఆమె ఆత్మకి శాంతి చేకూర్చాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. అలాగే మహబూబాబాద్ ఎంపీ కవిత, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, భాను ప్రసాద్ రావు, బాలసాని లక్ష్మీ నారాయణ, భూపాల్ రెడ్డి, గంగాధర్ గౌడ్, ఎమ్మెల్యే రెడ్యా నాయక్ తదితరులు కూడా బోడకుంటి విజయలక్ష్మికి నివాళులర్పించారు.