అహ్మదాబాద్: గుజరాత్లోని రోడ్లపై నీటితో నిండిన గుంతల వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యకర్తలు ఆదివారం వినూత్నంగా నిరసన తెలిపారు. రూ.500కు అమ్ముడుపోతే ఇలాంటి రోడ్లే ఉంటాయని విమర్శించారు. ఈ మేరకు ఫ్లకార్డులను ప్రదర్శించడంతోపాటు రోడ్లపై నీటితో ఉన్న గుంతల వద్ద డ్యాన్స్ చేశారు. ఈ వీడియోతోపాటు గాంధీనగర్లోని రెండవ వార్డులో నీట మునిగిన రోడ్ల ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
గాంధీనగర్లోని నేతలు వినియోగించే రోడ్లు మాత్రమే బాగుంటాయా? సాధారణ ప్రజలకు మంచి రోడ్లు ఉండవా? అని ఆప్ కార్యకర్తలు ప్రశ్నించారు. బీజేపీ పాలిత గుజరాత్ రాజధాని గాంధీనగర్ వార్డ్ నంబర్ 2లో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉన్నదని ట్విట్టర్లో పేర్కొన్నారు. గుజరాత్లో వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలపై ఆప్ దృష్టిసారించింది.
మరోవైపు గుజరాత్ రోడ్ల దుస్థితి గురించి ఆప్ నేతలు చేసిన సోషల్ మీడియా పోస్ట్లపై కొందరు నెటిజన్లు స్పందించారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న ఢిల్లీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిన ఎయిర్పోర్ట్, రోడ్లకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేశారు. ఆప్ అధికారంలో ఉన్న ఢిల్లీలో ఇది పరిస్థితి అంటూ కౌంటర్ ఇచ్చారు.