పారిస్: ఒర్లీన్స్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల డబుల్స్లో భారత జోడీ కృష్ణ ప్రసాద్ గారగ-విష్ణువర్ధన్ గౌడ్ పంజాల ఫైనల్కు దూసుకెళ్లారు. శనివారం సెమీఫైనల్లో కృష్ణ-విష్ణు జంట 21-17, 21-17తో ఇంగ్లండ్ ద్వయం హెమ్మింగ్-స్టాల్వుడ్ను చిత్తుచేసింది. మహిళల సింగిల్స్ సెమీస్లో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ 17-21, 17-21తో లైన్ క్రిస్టోపెర్సన్ (డెన్మార్క్) చేతిలో ఓడింది. మహిళల డబుల్స్లో సిక్కిరెడ్డి-అశ్విని పొన్నప్ప, మిక్స్డ్ డబుల్స్లో అశ్విని-ధృవ్ జోడీలు పరాజయం పాలయ్యాయి.