న్యూఢిల్లీ: గత ఏడాది నిజాముద్దీన్లోని మర్కజ్ మసీదు కరోనా సూపర్ స్ప్రెడ్డర్గా మారిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు రంజాన్ సీజన్ ప్రారంభమైంది. పవిత్ర మాసం వేళ అక్కడ ఒకేసారి 50 మంది ప్రార్థనలు చేసుకునేందుకు ఢిల్లీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. నిజాముద్దీన్లోని మర్కజ్ మసీదులో ప్రతి రోజు అయిదు సార్లు నమాజ్ చేసుకునేందుకు కూడా కోర్టు ఓకే చెప్పింది. కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ నియమాలకు తగినట్లు జరగాలన్నది. గత ఏడాది మార్చిలో తబ్లీగత్ జమాత్ వేడుకలు మర్కజ్ మసీదులో జరిగాయి. ఆ సమయంలో కరోనా ఉదృతంగా ఉన్న నేపథ్యంలో ఆ ఘటన వివాదాస్పదమైంది.