భోపాల్ : మెట్టినింటిని వీడి మామతో కలిసిఉంటోందని 20 ఏండ్ల గిరిజన మహిళను ఆమె సోదరులే చెట్టకు కట్టేసి కర్రలతో తీవ్రంగా కొట్టిన ఘటన మధ్యప్రదేశ్లోని అలిరాజ్పూర్ జిల్లాలో వెలుగుచూసింది. మహిళను హింసిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జూన్ 28న పుటలాబ్ గ్రామంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు. మహిళను చెట్టు కొమ్మకు కట్టేసి కర్రతో కుటుంబ సభ్యులు కొడుతుండగా ఆమె సాయం కోసం అందరినీ వేడుకోవడం వీడియోలో కనిపించింది.
ఇటీవలే ఆమెకు వివాహం కాగా భర్త పని కోసం గుజరాత్ వెళ్లాడు. ఈ క్రమంలో మహిళ తన మామ ఇంటికి వెళ్లగా ఆగ్రహించిన కుటుంబ సభ్యులు ఆమెను తిరిగి గ్రామానికి తీసుకువచ్చి దారుణానికి ఒడిగట్టారు. బాధితురాలిని నాంచి అజ్నర్గా గుర్తించిన పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇంతవరకూ ఎవరినీ అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు.