భగల్పూర్: రైల్వేస్టేషన్లో ఓ ఐదేండ్ల చిన్నారి తన తల్లిచెంత హాయిగా పడుకున్నాడు. అయితే, ఆ మాతృమూర్తి అప్పటికే మరణించింది. తల్లి చనిపోయిన విషయం తెలియక ఆ పిల్లాడు ఆమెను చుట్టుకుని అలాగే పడుకున్నాడు. కాసేపయ్యాక, ఆకలేయడంతో ఆ పసివాడు ఏడవడం మొదలెట్టాడు. రైల్వేప్లాట్ఫాంపై కొన్ని గంటలుగా ఆతల్లి నిర్జీవంగా పడిఉన్నా ఎవ రూ పట్టించుకోలేదు. ఈ హృదయవిదారక ఘటన బీజేపీ-జేడీయూ అధికారంలో ఉన్న బీహార్లోని భగల్పూర్ రైల్వేస్టేషన్లో జరిగింది. పిల్లాడి ఏడుపు చూసి ప్రయాణికులు సమాచారం ఇవ్వడంతో అధికారులు అక్కడికి చేరుకుని పిల్లాడిని సమీప దవాఖానకు తరలించి చికిత్స అందించారు. అయితే ఆ మహిళ ఎవరనేదానిపై వివరాలు తెలియలేదు. ఇంకా మాటలు రాకపోవడంతో పిల్లాడు ఎలాంటి వివరాలు చెప్పలేదు.