జైపూర్ : గుజరాత్ రాష్ట్రం నాగౌర్లోని కుచమన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కారు-ట్రక్కు ఒకదానికొకటి ఢీకొజైపూర్ : గుజరాత్ రాష్ట్రం నాగౌర్లోని కుచమన్ వద్ద శనివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కారు-ట్రక్కు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో ఐదుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితి విషమంగా ఉన్న బాలికను చికిత్స నిమిత్తం జైపూర్కు తరలించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. ప్రమాద విషయం తెలిసిన ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాత్ మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.