రాయ్గఢ్: మహారాష్ట్రలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాయగఢ్ జిల్లాలోని మహడ్ తలైలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఐదుగురు మరణించగా, 30 మందికిపైగా కనిపించకుండా పోయారు. భారీ వర్షాల కారణంగా మహడ్ తలైలో కొండ చరియలు విరిగిపడ్డాయని, దీనివల్ల ఐదురు మరణించారని జిల్లా కలెక్టర్ నిధి చౌదరి చెప్పారు. 15 మందిని కొండ చరియల కింది నుంచి వెలికి తీశామన్నారు. సుమారు 30 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారని వెల్లడించారు. ఘటనా స్థలంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయకచర్యలు కొనసాగిస్తున్నాయని చెప్పారు. భారీ వర్షాలతో జిల్లాలో నాలుగు చోట్ల కొండ చరియలు విరిగి పడ్డాయన్నారు. కాగా, భారీ వర్షాల కారణంగా సహాయక చర్యలకు ఆటంకాలు ఏర్పడ్డాయని చెప్పారు.