వేసవిలో పౌష్టికాహారంగా తీసుకుంటున్న గిరిజనులు
జొన్న, రాగితో తయారీ
ఇంద్రవెల్లి, ఏప్రిల్22: రోజురోజుకూ భానుడు భగ్గుమంటున్నాడు. వడగాలులతోపాటు దంచికొడుతున్న ఎండలతో ప్రజలు అల్లాడుతున్నారు. పట్టప్రాంతాల్లోనైతే వివిధ రకాల పండ్ల రసాలు, శీతల పానీయాలతో ఎండ నుంచి ప్రజలు ఉపశమనం పొందుతుంటున్నారు. కాని ఉమ్మడి జిల్లాలోని గిరిజన గ్రామాల్లో ఎలాంటి పండ్లు, పానీయాలు దొరకవు. తమ ఇండ్లలోనే జొన్న పిండితో అంబలిని(జావ) తయారు చేసుకుంటారు. మండుతున్న ఎండల నుంచి ఉపశమనం పొందడానికి చిన్నా, పెద్దా అంతా అంబలిని ఎంతో ఇష్టంగా తాగుతారు. వ్యవసాయ పనులతోపాటు ఇతర పనులకు వెళ్లేటప్పు డు, వచ్చిన తర్వాత ఓ గిన్నె అంబలి తాగితే కడు పు చల్లబడి ఎంతో హాయిగా ఉంటుందని గిరిజనులు చెబుతుంటారు. వేసవిలో తమ ఇండ్లకు వచ్చే బంధువులు, అతిథులకు అంబలి ఇచ్చేందుకే ప్రాధాన్యమిస్తామని ఆదివాసులు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
కొవిడ్ బాధితురాలి బంగారు ఆభరణాలు మాయం
IPL 2021: దూబే, రాహుల్ కీలక ఇన్నింగ్స్..రాజస్థాన్ స్కోర్ 177