ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ శ్రావణ్ రాథోడ్(66) కరోనాతో కన్నుమూసిన విషయం తెలిసిందే. దిగ్గజ సంగీత దర్శకుల ద్వయంలో ఒకరైన శ్రావణ్ రాథోడ్ (నదీమ్- శ్రావణ్ ) ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.అతని మృతి ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్కరిని తీవ్ర విషాదంలోకి నెట్టింది. అయితే శ్రావణ్ భార్య, కుమారుడు అంథేరి ఈస్ట్లోని సెవన్ హిల్స్ ఆసుపత్రిలో కరోనాకు చికిత్స తీసుకుంటున్న నేపథ్యంలో వారు కడసారి చూపుకు కూడా నోచుకోలేకపోయారు. ఈ విషయం అందరిని బాధిస్తుంది.
దీర్ఘకాలంగా షుగర్ వ్యాధితో బాధపడుతున్న శ్రావణ్కు వైరస్ కారణంగా ఊపిరితిత్తులు, ఇతర ఆర్గాన్ సిస్టమ్ పూర్తిగా పాడైపోయాయని ఈ క్రమంలోనే ఆయన మృత్యువాత పడ్డాడని తెలుస్తుంది. శ్రావణ్ మృతిని మ్యూజిక్ కంపోజర్ నదీమ్ సైఫీ కన్ఫాం చేశారు. శ్రావణ్ మృతిని జీర్ణించుకోలేని బాలీవుడ్ ఆయన మృతికి సంతాపం తెలియజేసింది. కాగా ఆషిఖీ, సాజన్, పర్దే, రాజా హిందుస్తానీ సూపర్ హిట్ పాటలతో నదీమ్-శ్రవణ్ జోడీ సంగీతాభిమానులను ఆకట్టుకున్నారు. 2000 ల మధ్య కాలంలో విడిపోయిన వీరిద్దరూ తిరిగి 2009లో డేవిడ్ ధావన్ దర్శకత్వంలో వచ్చిన డు నాట్ డిస్టర్బ్ మూవీకి కలిసి పని చేశారు.