మేడ్చల్ రూరల్, ఏప్రిల్ 21 : సీఎం కేసీఆర్ త్వరగా కొవిడ్ నుంచి కోలుకోవాలని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని రామరాజ్యంలా పాలిస్తున్నారని అన్నారు. ఆయన కొవిడ్ బారి నుంచి త్వరగా కోలుకోవాలని, నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని లక్ష్మీనారాయణ స్వామిని, సీతారాములను కోరుకున్నానని తెలిపారు. అలాగే ప్రజలను మహమ్మారి నుంచి రక్షించాలని, రాష్ట్రంలో మునపటి పరిస్థితులు నెలకొనాలని వేడుకున్నట్లు చెప్పారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్పర్సన్ మద్దుల లక్ష్మీశ్రీనివాస్రెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీనివాస్రెడ్డి, కౌన్సిలర్లు మల్లికార్జున్, జైపాల్రెడ్డి, బాలరాజు, వీణ, శ్రీనివాస్, హేమంత్రెడ్డి, టీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు సంజీవ గౌడ్, నాయకులు పాల్గొన్నారు.