బికనీర్ : రాజస్థాన్లోని బికనీర్ జిల్లాలో బుధవారం ఉదయం భూ కంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై ప్రకంపనల తీవ్రత 5.3గా నమోదైనట్లు జాతీయ భూకంప అధ్యయనం కేంద్రం తెలిపింది. ఉదయం 5 గంటల 24 నిమిషాల సమయంలో బికనీర్కు పశ్చిమ వాయువ్య దిశగా 343 కిలోమీటర్ల దూరంలో 110 కిలోమీటర్ల లోతులో 29.19 -అక్షాంశం 70.05- రేఖాంశల నడుమ ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు ట్విట్టర్లో వెల్లడించింది. మేఘాలయలోని వెస్టు ఘరోహిల్స్ ప్రాంతంలోనూ ఈ ఉదయం 4.1 మేగ్నట్యూడ్ తీవ్రతతో భూకంపనలు సంభవించినట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం పేర్కొంది.