పుణె: టీమ్ఇండియా నిర్దేశించిన 330 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ ఆరో వికెట్ కోల్పోయింది.
నిలకడగా ఆడుతున్న లియామ్ లివింగ్స్టోన్(36)ను 24వ ఓవర్లో శార్దుల్ ఠాకూర్ పెవిలియన్ పంపాడు. లో ఫుల్టాస్ వేసిన బంతిని శార్దుల్కే రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 95/4తో కష్టాల్లో పడిన జట్టును డేవిడ్ మలన్, లివింగ్స్టోన్ ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ ద్వయం ఇప్పటికే 50పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. లివింగ్స్టోన్ను ఔట్ చేయడం ద్వారా ప్రమాదకరంగా మారుతున్న జోడీని శార్దుల్ విడదీశాడు. మరో ఎండ్లో మలన్ వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ జట్టును ముందుండి నడిపించాడు. ఠాకూర్ వేసిన 26వ ఓవర్లో 48 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 50 మార్క్ చేరుకున్నాడు. అదే ఓవర్లో మలన్..రోహిత్కు క్యాచ్ ఇచ్చి నిరాశగా పెవిలియన్ చేరాడు.