న్యూఢిల్లీ : కేంద్ర క్యాబినెట్ను ఇవాళ ప్రధాని మోదీ విస్తరిస్తున్న విషయం తెలిసిందే. అయితే మొత్తం 43 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేయనున్నట్లు తెలుస్తోంది. దీంట్లో కొత్త, పాత మంత్రులు ఉండనున్నారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు కొత్త మంత్రుల జాబితాను రిలీజ్ చేయనున్నారు. అయితే లోక్ కళ్యాణ్మార్గ్లో ఉన్న ప్రధాని మోదీ నివాసానికి ఇప్పటికే కొందరు నేతలు చేరుకున్నారు. కొత్త మంత్రివర్గంలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళలకు పెద్దపీట దక్కే అవకాశాలు ఉన్నాయి.
సరబానంద సోనోవాల్, జ్యోతిరాధిత్య సింధియా, నారాయణ రాణే , భూపేంద్ర యాదవ్, అనురాగ్ ఠాకూర్, మీనాక్షి లేఖి, అనుప్రియా పటేల్, అజయ్ భట్, శోభా కరంజేల్, సునితా దుగ్గ, ప్రీతమ్ ముండే, శంతను ఠాకూర్, కపిల్ పటేల్, పశుపతినాథ్, ఆర్సీపీ సింగ్, కిషణ్ రెడ్డి, పరుశోత్తం రూపాలా, అశ్విని వైష్ణవ్, విజయ్ శోంకర్, మన్షుక్ మాండవియ్యా, హర్దీప్ పురి, రాజీవ్ చంద్రశేఖర్, బీఎల్ వర్మ, నితీశ్ ప్రమాణిక్, ప్రతిభా భౌమిక్, డాక్టర్ భారతి పవార్ , భగవత్ కరాడ్, ఎస్పీ సింగ్ భగల్లు మంత్రులు జాబితాలో ఉన్నారు.
కొందరు పాత మంత్రులకు మరిన్ని శాఖలను అప్పగించనున్నారు. తెలంగాణకు చెందిన కిషణ్ రెడ్డి ఆ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న ఆయనకు మరో శాఖను కేటాయించనున్నట్లు తెలుస్తోంది.