హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ)/ మలక్పేట/ ఉప్పల్/నిజామాబాద్ సిటీ: హైదరాబాద్, నిజామాబాద్లలో కొవిడ్ వ్యాక్సిన్లను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్న పది మందిని పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం రాత్రి సలీంనగర్ సబ్రోడ్లో రెమ్డెసివిర్ (కోవిఫార్) వ్యాక్సిన్లను బ్లాక్లో అ మ్ముతున్న ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మూడు వ్యాక్సిన్లను, ఆరు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిం దితులైన బానోత్ నరేశ్, నిమ్మ అశోక్, దిరావత్ సైదా, మణికొండ హరిబాబు, రాథోడ్ ఆ కాశ్ను గురువారం రిమాండ్కు తరలించారు. మధ్యవర్తి వినయ్ నుంచి రెమ్డెసివిర్ ఇంజక్షన్లను తీసుకొని అధిక ధరలకు అమ్ముతున్న కాచిగూడలోని ఓ మెడికల్ దుకాణం యజమాని బీ శ్రీహరిని పోలీసులు అరెస్టుచేశారు.
ఉప్పల్ మెట్రోస్టేషన్ ప్రాంతంలో రెమ్డెసివిర్ ఇంజక్షన్లు అక్రమంగా విక్రయిస్తున్న ఇద్దరు కాకుమణి దిలీప్, వల్లమాల మధును పోలీసులు అరెస్టు చేశారు. మూడు ఇంజక్షన్లు, రెం డు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో రెమ్డెసివిర్ ఇంజెక్షన్ అం టూ గ్లూకోజ్వాటర్ నింపిన టీకా ఇచ్చి మోసం చేసిన సాయికృష్ణనాయుడు అనే డాక్టర్ను, మ ధ్యవర్తి సతీశ్ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ రు నకిలీ రెమ్డెసివిర్బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ నాలుగో టౌన్ పరిధి లోని బ్లాక్లో రెమ్డెసివిర్ను బ్లాక్లో విక్రయి స్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టుచేశారు.