రోజురోజుకూ పెరుగుతున్న ఎండ తీవ్రత
బుధవారం 41.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు
నిర్మానుష్యంగా మారుతున్న రోడ్లు
ఖలీల్వాడి, మార్చి 31: జిల్లాలో పగటి ఉష్ణ్గోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వేసవి ప్రారంభంలోనే ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఎండ తీవ్రత ఎలా ఉంటుందోనని ప్రజలు భయపడుతున్నారు. రెండు మూడు రోజుల్లోనే ఉష్ణోగ్రత మూడు డిగ్రీలు పెరిగింది. బుధవారం గరిష్ఠ ఉష్ణోగ్రత 41.4 డిగ్రీలుగా నమోదైంది. భానుడి ప్రతాపంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.
ఎండాకాలం ఆరంభంలోనే భానుడు తన ప్రభావాన్ని చూపుతున్నాడు. పగలు ఎండ, రాత్రి పూట ఉక్కపోతతో ప్రజ లు ఇబ్బందులు పడుతున్నారు. రోజురోజుకూ ఎండ తీవ్రత క్రమం గా పెరుగుతున్నది. నిజామాబాద్ జిల్లాలో బుధవారం 41.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదయ్యింది. ప్రతి ఏటా ఎండలు ఎక్కువగా నమోదవుతున్నా.. పగలు వేడిగా ఉండి.. రాత్రి కాస్త చల్లగా ఉండేది. కానీ ఈసారి వింత పరిస్థితి నెలకొన్నది. పగలు, రాత్రి కూడా వాతావరణం వేడిగా ఉంటున్నది. రాత్రి సమయం లో 24 నుంచి 27 డిగ్రీల వరకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా యి. ఎండలో బయటికి వెళ్లాలంటే నే ప్రజలు భయపడుతున్నారు.
మ ధ్యాహ్నం 12 గంటలు అయ్యిందం టే చాలు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఈసారి ఎండలు ఎక్కువగానే ఉంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. గతేడాది మార్చి చివరి వారంలో 39.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదయ్యిం ది. కానీ ఈసారి ఏకంగా 1.5 డిగ్రీ లు అధికంగా నమోదయ్యింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో పిల్లలు, గర్భిణులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నా రు. అత్యవసరం అయితే తప్ప ఇంట్లో నుంచి బయటికి రావొద్దని, బయటికి వెళ్లాల్సి వస్తే తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని పేర్కొంటున్నారు. వేడి ఎక్కువగా ఉండడంతో ప్రజ లు శీతల పానియాలను తీసుకుంటున్నారు. ఇక కూలర్లకు మార్కె ట్లో గిరాకీ పెరిగింది.