తెగ తినేశారు.. జొమాటోలోనే నిమిషానికి 4100 ఆర్డర్లు!

న్యూఢిల్లీ: ఈసారి కొవిడ్ కారణంగా దేశంలోని చాలా నగరాల్లో కొత్ ఏడాది వేడుకలపై నిషేధం విధించారు. కొన్ని నగరాలు రాత్రి పూట కర్ఫ్యూలు కూడా పెట్టాయి. సాధ్యమైనంత వరకూ ప్రజలను ఇళ్లలోనే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకునే విధంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించాయి. దీంతో చాలా మంది డిసెంబర్ 31న ఇంట్లో కూర్చొనే విపరీతంగా ఫుడ్ ఆర్డర్లు చేసేశారు. ఏ రేంజ్లో తిన్నారంటే.. ఒక్క జొమాటోనే గరిష్ఠంగా నిమిషానికి 4100 ఆర్డర్లు వచ్చాయట. ఈ విషయాన్ని ఆ సంస్థ సీఈవో దీపిందర్ గోయల్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఈ నంబర్స్ చూసి ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సాయంత్రం సయమానికి నిమిషానికి 2500 ఉన్న ఆర్డర్ల సంఖ్య క్రమంగా పెరుగుతూ 4100కు చేరినట్లు చెప్పారు. ఒకదశలో లక్ష లైవ్ ఆర్డర్లు ఉన్నట్లు కూడా గోయల్ ట్వీట్ చేశారు. ఇది గతంలో ఎన్నడూ చూడలేదని ఆయన అన్నారు. ఇండియన్స్ ఎక్కువగా పిజ్జాలు, బిర్యానీలు ఆర్డర్ చేసినట్లు గోయల్ చెప్పారు.
Insane amount of strain in the system right now. 1.4 lakh live orders right now. ~20k biryanis in transit. And 16k pizzas; 40% of them extra cheese pizzas. #facts https://t.co/2TK8IHyxHp
— Deepinder Goyal (@deepigoyal) December 31, 2020
తాజావార్తలు
- శతాబ్ది రాయ్ ‘యూటర్న్’: తృణమూల్తోనే నేను
- శ్రీశైలంలో వైభవంగా మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
- ‘మాస్టర్’ 2 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్..100 కోట్ల వైపు పరుగులు
- రాహుల్ మొసలి కన్నీరు కారుస్తున్నారు: హర్సిమ్రత్ కౌర్
- పిస్టల్తో బర్త్డే కేక్ కట్: సోషల్ మీడియాలో వీడియో వైరల్
- ప్రజా వైద్యుడు రమక లక్ష్మణ మూర్తి కన్నుమూత
- ఇది సంక్రాంతి విజయం కాదు.. నిర్మాతలకు పెరిగిన నమ్మకం
- బీఈడీ తొలి విడుత సీట్లు కేటాయింపు
- ‘సలార్’లో యశ్ ఉన్నాడా..! పాన్ ఇండియన్ స్టార్స్ కలుస్తున్నారా..?
- ఇంటికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసి..