అహ్మదాబాద్ : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు దిగివస్తున్న క్రమంలో గుజరాత్ లోనూ కొద్దిరోజులుగా కొవిడ్-19 కేసుల సంఖ్యలో తగ్గుదల నమోదవుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కేవలం 405 తాజా కేసులు వెలుగుచూశాయి. మహమ్మారి బారినపడి ఒక్కరోజే ఆరుగురు ప్రాణాలు విడిచారు. ఇక గుజరాత్ లో కరోనా మరణాలు 10,000 దాటాయి.
మరోవైపు కరోనా నుంచి కోలుకుని మంగళవారం 1106 మంది డిశ్చార్జి అయ్యారని అధికారులు తెలిపారు. సూరత్ లో అత్యధికంగా 78 తాజా పాజిటివ్ కేసులు వెలుగుచూడగా, వదోదరలో 61, అహ్మదాబాద్ లో 47 కేసులు నమోదయ్యాయని అధికారులు పేర్కొన్నారు.