వర్ధన్నపేట, ఏప్రిల్ 26: పోలీస్స్టేషన్కు వస్తే తప్పకుండా న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని ప్రజలకు మరింతగా కలిగించేలా పోలీసులు విధులు నిర్వర్తించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి సూచించారు. సోమవారం వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీసీపీ శ్రీనివాస్రెడ్డి, ఏసీపీ గొల్ల రమేశ్తో కలిసి స్టేషన్ను పరిశీలించి, సిబ్బందికి సూచనలు చేశారు. శాంతిభద్రతల విషయంలో ఏమాత్రం రాజీపడొద్దని, నేర నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పోలీస్స్టేషన్ ఆవరణను పరిశుభ్రంగా ఉంచుతూ మొక్కలు పెంచి ఆహ్లాదకర వాతావరణం ఉండేలా చూడాలని స్టేషన్ అధికారులకు సూచించారు. సీఐ విశ్వేశ్వర్, ఎస్సై వంశీకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.
బాధితుల మనోధైర్యం రెట్టింప్పవ్వాలి
రాయపర్తి: న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు మనోధైర్యం రెట్టింపయ్యేలా పోలీస్ సిబ్బంది తమ పనితీరును తీర్చిదిద్దుకోవాలని సీపీ తరుణ్ జోషి సూచించారు. సోమవారం వెస్ట్జోన్ డీసీపీ శ్రీనివాస్రెడ్డితో కలిసి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. స్టేషన్ పరిసరాలు, క్వార్టర్ల ఆవరణలు, ఠాణాలోని రికార్డులు, రిజిస్టర్లు, సిబ్బంది పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం డీసీపీ శ్రీనివాస్రెడ్డి, వర్ధన్నపేట ఏసీపీ గొల్ల రమేశ్, సీఐ విశ్వేశ్వర్, రాయపర్తి, వర్ధన్నపేట ఎస్సైలు పింగిళి నాగరాజు, వంశీకృష్ణతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పోలీసులు విధి నిర్వహణలో ప్రజలతో స్నేహపూర్వక సంబంధాలు కలిగి ఉండాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏఎస్సై సదయ్య, సిబ్బంది రవీందర్, సురేశ్, రాజు, రమేశ్, కత్తుల శ్రీనివాస్, అన్వేశ్, మహేందర్, రవి, హైమావతి, పూర్ణచందర్రెడ్డి, సోమ్లానాయక్ పాల్గొన్నారు.
చట్టానికి లోబడి ఫిర్యాదులపై చర్యలు
హన్మకొండ సిటీ: గ్రీవెన్స్కు వచ్చే ఫిర్యాదులపై చట్టానికి లోబడి చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీస్ కమిషనర్ తరణ్జోషి తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్లో వివిధ సమస్యలపై పలువురు ఫిర్యాదు చేశారు. బాధితులకు న్యాయం జరుగుతుందని సీపీ భరోసా కల్పించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఏదైనా సమస్య ఉంటే సంబంధిత పోలీస్స్టేషన్ లేదా పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. అక్కడ న్యాయం జరుగకపోతే గ్రీవెన్స్కు రావాలని సూచించారు. గ్రీవెన్స్లో 20 మంది ఫిర్యాదు చేయగా, వాటిలో కుటుంబ, భూ తగాదాలు, శాంతి భద్రతలకు సంబంధించినవి ఉన్నాయి. సీఈ వెంట సీఐ హన్నన్, సెంట్రల్ కంప్లయింట్ సెల్ ఏఎస్సై శ్రీలత ఉన్నారు.