న్యూఢిల్లీ: భారత నౌకాదళానికి చెందిన యుద్ధ నౌక ఐఎన్ఎస్ రణవిజయ్లో మంటలు చెలరేగాయి. మంటలను అదుపు చేసే క్రమంలో నలుగురు నావికులు గాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలోని నేవీ ఆసుపత్రి ఐఎన్హెచ్ఎస్ కళ్యాణికి వారిని తరలించి చికిత్స అందిస్తున్నారు. శనివారం సాయంత్రం 5.30 గంటలకు ఈ ఘటన జరిగినట్లు నేవీ అధికారులు తెలిపారు. నేవీ బృందాలు మంటలను అదుపు చేసినట్లు చెప్పారు.
డిస్ట్రాయర్ క్లాస్ షిప్ ఐఎన్ఎస్ రణవిజయ్ ఇటీవల సముద్రంలో వ్యాయామం తర్వాత విశాఖపట్నం నేవల్ బేస్కు చేరిందని ఈస్టర్న్ నేవల్ కమాండ్ తెలిపింది. నౌకలో మంటలు చెలరేగిన ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు వెల్లడించింది.