అచ్చంపేట/అచ్చంపేట రూరల్, జూన్ 8: గ్రామాల్లో పెండింగ్లో ఉన్న వైకుంఠధామా ల పనులు సత్వరమే పూర్తి చేయకుంటే స ర్పంచులను సస్పెండ్ చేస్తామని అదనపు క లెక్టర్ మనూచౌదరి హెచ్చరించారు. మంగళవారం అచ్చంపేట మండలంలోని ఏజెన్సీ గ్రామాలైన జోగ్యతండా, దుబ్బతండా, కొ ర్రతండాల్లో పర్యటించారు. ఆ గ్రామాల్లో పెండింగ్లో ఉన్న వైకుంఠధామాలను పరిశీలించారు. సర్పంచులతో మాట్లాడారు. ఆల స్యం కావడానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. వారం రోజుల్లో జోగ్యతాండ వైకుంఠధామం పనుల్లో పురోగతి లేకుంటే చర్యలు తప్పవని సర్పంచ్ను హెచ్చరించారు. వైకుంఠధామాల పనులు పూర్తి చేసిన వారికి బిల్లులు విడుదల అవుతున్నాయని ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. మిలిగిన గ్రామాల్లో పూర్తి చేశారని కొన్ని గ్రామాల్లోనే పెండింగ్లో ఉన్నాయన్నారు. వైకుంఠధామం కట్టిన వాటికి బిల్లులు రాలేదని అప్పులు తెచ్చి కడుతున్నామని కొందరు సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు.
చేసిన పనులకు డబ్బులు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. పెండింగ్ బిల్లులు ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామని పెండింగ్లో ఉన్న వైకుంఠధామాల పనులు తొందరగా పూర్తి చేయాలన్నారు. పనులు పూర్తి చేయకుంటే సర్పంచులు, కార్యదర్శులపై వేటు తప్పదని హెచ్చరించారు. సర్పంచులు, కార్యదర్శులు, ఎంపీడీవో బాధ్యత తీసుకోని పనులు పూర్తి చేయించాలని ఆదేశించారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం పనిచేస్తుంటే కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. వారం రోజుల్లో ఈ మూడు గ్రామాల్లో పనులలో పురోగతి పెంచాలని ఆదేశించారు. సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో చెన్నమ్మ, ఏపీవో మల్లేశ్, సర్పంచులు పాల్గొన్నారు.