ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి
నర్సంపేట, మార్చి 28: విశ్వవిద్యాలయాల అభివృద్ధికి, విద్యా ప్రమాణాల పెంపునకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. ఆదివారం నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, కేయూ పాలక మండలి సభ్యుడు డాక్టర్ బీ చంద్రమౌళి ఎమ్మెల్సీ పల్లాను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రాజేశ్వర్రెడ్డి మా ట్లాడుతూ వివిధ విశ్వవిద్యాలయాల ఉపకులపతుల నియామకాన్ని సీఎం కేసీఆర్ త్వరలో పూర్తి చేస్తారన్నారు. బ్లాక్ గ్రాంట్ విడుదలకు ప్రయత్నం చేస్తానని, ఆన్లైన్ బోధనలో కాకతీయ విశ్వవిద్యాలయం ముందుండడం అభినందనీయమన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం అభివృద్ధికి పాలక మండలి సభ్యు లు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మదన్కుమార్, నాగేంద్రబాబు, రాజిరెడ్డి, ప్రొఫెసర్లు మల్లారెడ్డి, మనోహర్, రాజేశ్వర్, ఉమామహేశ్వరి, సీతారాం ఉన్నారు.