శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని కిష్టావర్ ప్రాంతంలో భారీ వరదలు సంభవించాయి. కిష్టావర్లోని హంజార్లో బుధవారం ఉదయం ఒక్కసారిగా భారీ వరద పోటెత్తింది. వరదల ప్రభావంతో గ్రామంలోని చాలా ఇండ్లు కొట్టుకుపోయాయి. దీంతో నలుగురు మరణించారు. మరో 30 నుంచి 40 మంది గల్లంతయ్యారు. వరదల ధాటికి 9 ఇండ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని కిష్టావర్ జిల్లా మేజిస్ట్రేట్ అశోక్ కుమార్ తెలిపారు. శిథిలాల నుంచి ఇప్పటివరకు నాలుగు మృతదేహాలను వెళికితీశామని చెప్పారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, భారత వాయు సేన కూడా ఈ సహాయక చర్యల్లో పాలుపంచుకుంటుందని వెల్లడించారు.
జమ్ముకశ్మీర్లోని చాలా ప్రాంతాల్లో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా, రానున్న రోజుల్లో హెవీ రెయిన్స్ కురిసే అవకాశం ఉందని వాతారణ శాఖ హెచ్చరించింది. నదుల్లో నీటి ప్రవాహం పెరగనుందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అధికారులు సూచించారు.