ఖాట్మండు : నేపాల్లో వరుసగా భూకంపనలు సంభవిస్తున్నాయి. బుధవారం ఉదయం రాజధాని ఖాట్మండుకు తూర్పు ఈశాన్య దిశలో ప్రకంనలు చోటు చేసుకోగా.. రాత్రి 10 గంటల తరువాత వాయవ్య ప్రాంతానికి 94 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించింది.
రిక్టర్ స్కేలుపై ప్రకంపనల తీవ్రత 4.4గా నమోదైందని భారత భూకంప అధ్యయన కేంద్రం తెలిపింది. భూప్రకంపన కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. వరుస భూప్రకంపనలతో రాజధాని పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు లోనవుతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.