భారత్ చేరిన మరో మూడు రాఫెల్స్

న్యూఢిల్లీ: మరో మూడు రాఫెల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి భారత్కు బుధవారం చేరుకున్నాయి. యూఏఈ ఎంఆర్టీటీ ద్వారా గాలిలోనే ఇంధనం నింపుకున్న ఈ జెట్స్ ఏకధాటిగా 7 వేల కిలోమీటర్ల దూరంపైగా ప్రయాణించి గుజరాత్లోని జామ్నగర్ ఎయిర్ బేస్లో ల్యాండ్ అయ్యాయి. అత్యాధునిక యుద్ధ విమానాలైన 36 రాఫెల్స్ను రూ.59 వేల కోట్ల వ్యయంతో కొనుగోలు చేసేందుకు 2016లో ఫ్రాన్స్తో భారత్ ఒప్పందం చేసుకున్నది.
గత ఏడాది జూలై 29న తొలి బ్యాచ్గా ఐదు రాఫెల్స్ పంజాబ్లోని అంబాలా ఎయిర్ బేస్కు చేరుకున్నాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వాటిని లాంఛనంగా భారత వాయుసేనలోకి ప్రవేశపెట్టారు. గత ఏడాది నవంబర్లో రెండో బ్యాచ్ కింద మూడు రాఫెల్స్ జామ్నగర్ ఎయిర్ బేస్కు చేరాయి. తాజాగా మూడో బ్యాచ్ కింద మరో మూడు రాఫెల్స్ బుధవారం రాత్రికి జామ్నగర్ ఎయిర్ బేస్లో ల్యాండ్ అయ్యాయి. వీటి రాకతో ఐఏఎఫ్లో రాఫెల్స్ సంఖ్య 11కు చేరింది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.తాజావార్తలు
- గాఢ నిద్రలో ఏనుగు పిల్ల.. తల్లి ఏనుగు ఏమి చేసిందంటే..
- టీచర్కు స్టూడెంట్ ఓదార్పు.. వైరల్ అవుతున్న లెటర్
- యువకుడి వేధింపులు.. వివాహిత ఆత్మహత్య.!
- రామ్తో కృతిశెట్టి రొమాన్స్..మేకర్స్ ట్వీట్
- కుక్కల దాడిలో 22 గొర్రెలు మృతి
- పెట్రోల్ మంట: భారత విజ్ఞప్తిని పట్టించుకోని సౌదీ అరేబియా
- భృంగివాహనంపై ఊరేగిన ముక్కంటీశుడు
- జగన్కు విదేశీ జైలు తప్పదు : నారా లోకేశ్
- జూబ్లీహిల్స్ శ్రీవారి ఆలయ తొలి బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
- మహారాష్ట్రలో కొత్తగా 10,216 కరోనా కేసులు.. 53 మరణాలు