హైదరాబాద్: భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు అవుతున్న సందర్భంగా ఖతర్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. 75వ స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకుని విదేశీ వ్వవహారాల మంత్రిత్వ శాఖ వివిధ దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలతో కలిసి ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ను 75 వారాలపాటు నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా ఖతర్లోని ఇండియన్ కల్చరల్ సెంటర్ (ఐసీసీ) సహకారంతో నిర్వహిస్తున్న ఈ వేడుకలను ఖతర్లో భారత రాయబారి దీపక్ మిట్టల్ ప్రారంభించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ వర్చువల్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. భారతదేశ ఔన్నత్యాన్ని, సంస్కృతి, గొప్పదనాన్ని కొనియాడారు. వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, ఇది రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత పెంపొందిస్తుందని చెప్పారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
అలస్కాలో కుప్పకూలిన హెలికాప్టర్..
ప్రపంచ వాణిజ్యానికి ట్రాఫిక్ జామ్
చిన్నారి పెళ్లికూతురు పెళ్లి పీటలెక్కిందా?
తీరొక్క ఆప్షన్లతో ధరణి పోర్టల్