న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం చాలావరకు తగ్గింది. అయినా రోజువారీ కరోనా పరీక్షల ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతున్నది. ప్రతిరోజూ 20 లక్షలకు అటుఇటుగా కరోనా పరీక్షలు జరుగుతున్నాయి. శనివారం కూడా 18,11,446 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. దాంతో దేశంలో ఇప్పటివరకు జరిగిన మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 39,10,19,083కు చేరింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎమ్మార్) ఆదివారం మీడియాకు ఈ వివరాలను వెల్లడించింది.