హన్మకొండలోని దాసరివాడలో రావిచెట్టు తొర్రలో పోచమ్మ వెలసింది. దీంతో స్థానికులు ఆ చెట్టుకు ఆనుకొని ఒక గుడిని నిర్మించి ఎన్నో ఏండ్లుగా అమ్మవారిని సేవించి తరిస్తున్నారు. భారతీయ సమాజం ప్రకృతితో ఎంతగా మమేకమై జీవిస్తున్నదనే దానికి ఉదాహరణగా నిలుస్తున్నదీ గుడి.