తిరువనంతపురం: కేరళలో మరోసారి కరోనా వైరస్ విజృంభిస్తున్నది. ఇటీవల కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నది. శుక్రవారం నుంచి శనివారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 12,118 కరోనా కేసులు, 118 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 28,77,989కు, మొత్తం మరణాల సంఖ్య 12,817కు పెరిగింది. కేరళలో గత 24 గంటల్లో 11,124 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కోలుకున్న వారి మొత్తం సంఖ్య 27,63,616కు చేరిందని పేర్కొంది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,01,102 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు వెల్లడించింది.