పట్నా: బీహార్లోని ముజఫర్పూర్ జిల్లాలో కరోనా మహమ్మారి విళయతాండవం సృష్టిస్తున్నది. జిల్లాలోని సక్రా బ్లాక్లో కరోనా లక్షణాలతో గత 27 రోజుల్లో 36 మంది మరణించారు. దీంతో ప్రజలు భయంభయంగా కాలం వెళ్లదీస్తున్నారు. కాగా, సర్ధి, దగ్గుతో గ్రామంలో గత 27 రోజుల్లో 36 మంది మరణించారని గ్రామ సర్పంచ్ వెల్లడించారు. ఈ మరణాలకు సంబంధించి బ్లాక్ వైద్యాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలనని, పరీక్షలు నిర్వహించాలని చెప్పానన్నారు. అయితే అక్కడ టెస్టింగ్ కిట్లు అందుబాటులో లేవని తెలిపారు. దీంతో తమకు కిట్లు కావాలని, మరణాలకు గల కారణాలు తెలుసుకోవాలని జిల్లా వైద్యాధికారులను కోరినట్లు చెప్పారు.
ఈ నేపథ్యంలో సక్రా బ్లాక్లో ఎడారి వాతావరణం నెలకొన్నది. కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రజలు ఇంటి గడప దాటడానికి జంకుతున్నారు. అంతా తమ ఇళ్లకే పరిమితమవడంతో కర్ఫ్యూ వాతారణం నెలకొన్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి