పెంపును అమల్లోకి తెచ్చిన కేంద్ర కార్మిక శాఖ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: ఎంప్లాయీస్ డిపాజిట్ అనుసంధాన బీమా (ఈడీఎల్ఐ) పథకం-1976 కింద గరిష్ఠ ప్రయోజనం పెరిగింది. రూ.6 లక్షల నుంచి 7 లక్షలకు పెంచుతూ ఉద్యోగ భవిష్యనిధి ఈపీఎఫ్వో ట్రస్టీల కేంద్ర బోర్డు గతేడాది సెప్టెంబర్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. అయితే ఇప్పుడు ఆ నిర్ణయాన్ని తమ మంత్రిత్వ శాఖ అమల్లోకి తెచ్చిందని, ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన కూడా విడుదలైందని గంగ్వార్ పీటీఐకి గురువారం తెలిపారు. దీంతో ఉద్యోగులకు లాభం చేకూరినైట్లెంది. కాగా, నిరుడు ఫిబ్రవరి 14 తర్వాత కూడా ఈ పథకం కింద కనీస ప్రయోజనంగా రూ.2.5 లక్షలను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఈపీఎఫ్వో ట్రస్టీల కేంద్ర బోర్డు తెలిపింది. నిజానికి ఫిబ్రవరి 14తోనే ఈ ప్రయోజనం కాలపరిమితి తీరిపోయింది. కానీ ఇప్పుడు దాన్ని పొడిగించారు.