శ్రీనగర్: కరోనా ఉధృతి నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని నిలువరించడానికి కేంద్రపాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్లో కర్ఫ్యూ విధించారు. కరోనా కట్టడికి 34 గంటల కర్ఫ్యూని అధికారులు అమలు చేస్తున్నారు. శనివారం రాత్రి 8 గంటలకు ప్రారంభమైన కర్ఫ్యూ సోమవారం ఉదయం 6 గంటల వరకు అమల్లో ఉంటుందని అధికారులు వెల్లడించారు. దీంతో అన్నిరకాల మార్కెట్లు, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. కేవలం అత్యవసరమైన సేవలకు మాత్రమే అనుమతిస్తున్నారు.
జమ్ముకశ్మీర్లోని ఎనిమిది జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఈనెల 8 నుంచి రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉన్నది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అమల్లో ఉన్నది. అనంతరం ఏప్రిల్ 20న దాన్ని 20 జిల్లాల్లోని మున్సిపల్, గ్రామీణ ప్రాంతాలకు పెంచారు. కేంద్రపాలిత ప్రాంతంలో నిన్న 2030 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,58,374కు చేరింది. ఇందులో 2126 మంది మరణించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..