బెంగళూరు: దేశంలో కరోనా మహమ్మారి ( Corona virus ) తగ్గుముఖం పట్టింది. దాంతో వివిధ రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలను తిరిగి తెరుస్తున్నారు. అయితే, కర్ణాటకలో మాత్రం స్కూళ్లు, కాలేజీలను ఇప్పటికే ప్రారంభించారు. ఈ నేపథ్యంలో తాజాగా కోలార్ జిల్లాలోని ఓ కాలేజీలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ పరీక్షల ఫలితాలను అందరినీ షాక్ గురిచేశాయి. ఎందుకంటే ఆ పరీక్షల్లో కాలేజీలోని మొత్తం విద్యార్థుల్లో 32 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.
కాగా, ఈ ఘటనను కర్ణాటక ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ప్రస్తుతం కరోనా పాజిటివ్ తేలిన విద్యార్థులంతా కేరళ నుంచి వచ్చిన వారేనని కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి డా.కే. సుధాకర్ చెప్పారు. మరి కొద్ది సేపట్లో తాను ఆ కాలేజీని సందర్శిస్తానని, కాలేజీ యాజమాన్యంపపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.