హైదరాబాద్ : సికింద్రాబాద్ నియోజకవర్గం ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చినా పరిష్కరించడం కోసం నిరంతరం వారికి అందుబాటులో ఉంటామని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు. సీతాఫల్మండి డివిజన్లోని పలు ప్రాంతాలలో రూ. 2.25 కోట్లతో జరిపిన అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దశాబ్దాల కాలంగా ఎలాంటి అభివృద్ధి జరుగకుండా మురికి కూపాలులుగా ఉన్న బస్తీలను ఎంతో ఆదర్శవంతంగా తీర్చిదిద్దామని అన్నారు.
కోట్లాది రూపాయలతో మౌళిక వసతులను కల్పించామని వివరించారు. చిలకలగూడ బడీమసీదు, కిందిబస్తీ, భవానినగర్, అన్నానగర్, ఉప్పరిబస్తీ, ఫ్రైడే మార్కెట్, మహ్మద్గూడ తదితర ప్రాంతాలలో జరిగిన రోడ్ల నిర్మాణాలను ప్రారంభించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, కార్పొరేటర్ హేమ, జీహెచ్ఎంసీ ఈఈ ఆశ, నేతలు రామేశ్వర్గౌడ్, మున్నూరు చందు, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
త్వరలో సోమశిల- సిద్ధేశ్వరం బ్రిడ్జి నిర్మాణం
న్యాయవాది వృత్తిలో ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
అసంపూర్తి పనులు సత్వరమే పూర్తి చేయాలి
మెరుగైన వైద్యమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే గండ్ర